20-06-2025 12:24:49 AM
యాదాద్రి భువనగిరి జూన్ 19 ( విజ యక్రాంతి) : పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో పూర్తికావస్తున్నాం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు. పేద ప్రజలు సొంతింటి కలలను ఇందిరమ్మ ఇండ్ల ద్వారా తమ ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
ప్రజా పాలన అందిస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని నిరంతరం పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి శక్తివంచలు లేకుండా కృషి చేస్తుందన్నారు.
గత ప్రభుత్వం చేసిన మోసాలకు అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని వారి దోపిడీ అవినీతి కారణంగా రాష్ట్రం దివాలా తీసింది అన్నారు. అనంతరం ఇంది రమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్యలు నూతన వస్త్రాలు బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు