20-06-2025 12:23:19 AM
పథకంలో చేరేందుకు నేతన్నలకు గడువు పొడిగింపు
నల్గొండ టౌన్, జూన్ 19 : అర్హులైన ప్రతి పేద నేత కార్మికుని త్రిఫ్ట్ ఫండ్ పథకంలో చేరేందుకు నెల రోజుల పాటు గడువు పొడిగించాలని బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భోనగిరి దేవేందర్, సీనియర్ నాయకుడు రావుల శ్రీనివాస్ రెడ్డి, చెరుపల్లి జయప్రకాష్, గంజి రాజేందర్ జెల్ల శ్రీను, గంజి లక్ష్మీనారాయణ, మూఢ వేణు, మిర్యాల కిరణ్ ఆధ్వర్యంలో నల్గొండ జౌలీశాఖ సహాయ సంచాలకులు ద్వారక్ కి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలి నేత కార్మికుల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణ నేతన్నల అభివృద్ధి పథకమైన త్రిఫ్ట్ ఫండ్ పథకం కొరకు దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగిసి పోతుందని, జిల్లా వ్యాప్తంగా దాదాపు 15 వేల మంది పేద నేత కార్మికుల భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని నెల రోజుల పాటు గడువు పెంచాలని, అదేవిధంగా నూతన బ్యాంకు ఎకౌంట్లు తీసుకునేందుకు బ్యాంకు వారి అనేక షరతులతో పేద కార్మికులు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని నాయకులు అన్నారు.