నెట్ పరీక్షలకు కొత్త తేదీలు
29-06-2024 12:50 AM
ఈసారి ఆన్లైన్లో పరీక్ష
న్యూఢిల్లీ జూన్ 28: పేపర్ లీకేజీ ఆరోపణలతో రద్దయిన నెట్-2024 పరీక్షలను మరలా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీలను ప్రకటించింది. ఇంతకు ముందు ఆఫ్లైన్ విధానంలో జరిగే పరీక్షలను ఈ సారి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ పరీక్షలను ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది.






