calender_icon.png 2 June, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో రెండు 33/11 కెవి సబ్ స్టేషన్లు

31-05-2025 08:11:50 PM

- జడ్చర్ల మండలంలోని పెద్దపల్లి - చిన్నపల్లి, మిడ్జిల్ మండలంలోని మున్ననూరు గ్రామాలలో ఏర్పాటుకు సన్నద్ధం

- రూ 7.17 కోట్లతో రూపుదిద్దుకోనున్న కొత్త విద్యుత్ ఉప కేంద్రాలు.

- ఇప్పటికే వచ్చిన 9  సబ్ స్టేషన్లు: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

జడ్చర్ల (విజయక్రాంతి): నాణ్యమైన విద్యుత్ అందించడం ఎలక్షన్ గా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ మేరకు జడ్చర్ల ఎమ్మెల్యే నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో నాణ్యమైన విద్యుత్ అందాలను సంకల్పంతో జడ్చర్ల నియోజకవర్గానికి మరో రెండు కొత్త 33/11kv సబ్ స్టేషన్లను మంజూరు చేయడంలో కీలక పాత్ర వహించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampally Anirudh Reddy) తెలిపారు. మిడ్జిల్ మండలంలోని మున్ననూరు, జడ్చర్ల మండలంలోని పెద్దపల్లి (చిన్నపల్లి) గ్రామాలలో ఈ కొత్త సబ్ స్టేషన్ లను నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.

పెద్దపల్లి (చిన్నపల్లి) గ్రామాలలో ఏర్పాటుచేసే సబ్ స్టేషన్ ను రూ 3.56 కోట్ల వ్యయంతోను, మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ రూ.3.61 కోట్ల వ్యయంతోను నిర్మించనున్నట్లు  ఆయన వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల నియోజకవర్గంలో ఇదివరకే 9 సబ్ స్టేషన్ లు మంజూరు కాగా, ఇప్పుడు కొత్తగా మంజూరైన రెండు సబ్ స్టేషన్ లతో కలిపి నియోజకవర్గానికి కాంగ్రెస్ హయాంలో వచ్చిన సబ్ స్టేషన్ ల సంఖ్య 11 కు పెరిగింది. దీంతో నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు తీరనున్నాయని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. మునుముందు మరిన్ని సంక్షేమాల ను జడ్చర్లకు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు. జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు పెట్టుకున్నా నమ్మకాన్ని రెట్టింపు చేసేలా పనిచేస్తున్న అన్ని తెలియజేశారు.