31-05-2025 08:13:56 PM
నిర్మల్ (విజయక్రాంతి): సొన్ మండలం కడ్తాల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy) శనివారం పరిశీలించారు. వర్షాలతో తడిసిన ధాన్యంను సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మార గంగారెడ్డి, హరీష్ రెడ్డి, నర్సయ్య, సవీన్, గంగాధర్, తో పాటు తదితరులు పాల్గొన్నారు.