30-05-2025 05:54:02 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): ఎరువులు పంపిణీ చేసేందుకు ఉపయోగించే ఈ పాస్ నూతన మిషిన్లను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన(Mancherial District Agriculture Officer Kalpana) డీలర్లకు అందజేశారు. శుక్రవారం నస్పూర్ మండలంలోని సీతారాం పల్లిలోని రైతు వేదికలో మంచిర్యాల వ్యవసాయ డివిజన్ పరిధిలోని నస్పూర్, మంచిర్యాల, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లోని ఎరువుల దుకాణ డీలర్లకు నిర్వహించిన సమావేశంలో డీఏఓ మాట్లాడారు. రైతులకు ఎరువులను సకాలంలో అందేటట్లు నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. రైతు వ్యవసాయ భూమి ఆధారంగా ఎరువులను ఇవ్వాలని, అతిగా ఎరువులు వాడడం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించాలన్నారు.
అనంతరం డీలర్స్ కి విజన్ టెక్ సంస్థ ఈ-పాస్ ఎల్-1 (ePOS L1(Visiontek )) కొత్త మెషీన్ లను స్పీక్ ఫెర్టిలైజర్ (SPIC FERTILIZER) కంపెనీ ఆధ్వర్యంలో డి ఏ ఓ కల్పన చేతుల మీదుగా అందజేశారు. కొత్త మిషన్ ఎలా ఉపయోగించాలో డీలర్లకు ఆహ్వానం కల్పించారు. రైతులకు అందజేసే ఎరువులను కొత్త ఈపాస్ మిషన్ లో రైతు ఆధార్ కార్డు ఆధారంతో వ్యవసాయ భూమి, పంటల వారీగా ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంచిర్యాల డివిజన్ అధికారి (ఏడిఏ) అనిత, టెక్నికల్ ఏవో కొంక శ్రీనివాస్, డివిజన్ లోని వ్యవసాయ అధికారులు కృష్ణ (హాజీపూర్), శ్రీకాంత్ (లక్షెట్టిపేట), స్పీక్ కంపెనీ ప్రతినిదులు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు.