27-06-2025 02:01:34 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో అక్రమ మద్యం, మాదక ద్రవ్యాల నియంత్రణే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఎక్సుజ్ శాఖను మరింత బలోపేతం చేసే క్రమంలో రాష్ర్టవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 14 ప్రొహిబిషన్ అండ్ ఎక్సుజ్ పోలీస్ స్టేషన్లు శనివారం నుంచి అధికారికంగా తమ విధులను ప్రారంభించనున్నాయి.
ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో స్టేషన్లను ప్రారంభించనున్నారు. 2020 నుంచి పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనలకు ప్రస్తుత ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంతో ఎక్సుజ్ శాఖలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. రాష్ర్టంలో పెరుగుతు న్న జనాభా, విస్తరిస్తున్న నగరాలకు అనుగుణంగా ఎక్సుజ్ శాఖ పరిధిని పునర్వ్యవస్థీ కరించారు. అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి డివిజన్లలో 12 స్టేషన్లు ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ డివిజన్లో ఆరు.. బంజారాహిల్స్, మారేడ్పల్లి, చిక్కడపల్లి, కాప్రా, నాచారం, అల్వాల్, రంగారెడ్డి డివిజన్లో ఆరు గండిపేట, కొండాపూర్, మీర్పేట, పెద్దా అంబర్పేట, కొంపల్లి, కూకట్పల్లి, మెదక్ డివిజన్లో ఒకటి అమీన్పూర్, వరంగల్ డివిజన్లో ఒకటి హసన్పర్తిలో ప్రారంభించనున్నారు.
స్టేషన్ల కోసం అద్దె భవనాలను గుర్తించాలని ఉన్నతాధికారులు ఆదేశించగా, ఇప్పటికే 8 స్టేషన్లకు భవనాలు ఖరారయ్యాయి. ప్రస్తుతానికి సమీపంలోని పాత ఎక్సుజ్ స్టేషన్ల నుంచే పనిచేస్తా యి. పాత స్టేషన్ల ఎస్హెఓలే కొత్త స్టేషన్లకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. ప్రతి కొత్త స్టేషన్ కు ఇద్దరు కానిస్టేబుళ్లను కేటాయించారు.