27-06-2025 02:01:54 AM
వేములవాడ టౌన్: జూన్ 26 (విజయక్రాంతి); వేములవాడ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు ఇంటికి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు ఆయ న జర్మని పౌరుడైనని ఇటీవల హైకోర్టు తీ ర్పు ఇవ్వడంతో ఇక్కడ ఓటు హక్కును తొలగించాలని అధికారులు నిర్ణయించుకున్నా రు.
జర్మనీ పౌరుడు గా ఉంటూ భారతీయ పౌరసత్వం పొంది వేములవాడ ఎమ్మెల్యే గెలిచిన రమేష్ బాబు ఎన్నిక చెల్లదంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ 2010 నుండి కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు ఆయన పౌరసత్వ వివాదంపై ఇటీవలే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో దీంతో రమేష్ బాబు ఓటర్ హక్కు ఓటర్ జాబితా నుండి తొలగించాలని అధికారులు నిర్ణయించుకున్నారు
ఈ మేరకు వారం నెంబర్ 7 ప్రకారం ఓటర్ జాబితా నుండి రమేష్ బాబు పేరుని తొలగిస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు ఈ మేరకు నోటీసులు రమేష్ బాబు సంగీత నిలయం అయినా ఇంటికి అతికించడంతోపాటు పోస్ట్ ద్వారా కూడా పంపించినట్టు తెలుస్తుంది ఓటు హక్కును తొలగించే విషయంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే ఏడు రోజుల పూర్తి ఆధారాలతో కూడిన వివరాలను సమర్పించాలని ఈ నోటీసులు పేర్కొన్నారు.