calender_icon.png 7 June, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల డీలర్స్ కు కొత్త మిషన్లు అందజేత..

05-06-2025 09:53:14 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైతు వేదికలో గురువారం ఎరువుల డీలర్స్ కు కొత్త ఈపీఓఎస్ యంత్రం(EPOS Machine)ను జిల్లా వ్యవసాయా అధికారి  కల్పన(District Agriculture Officer Kalpana) అందజేశారు. బెల్లంపల్లి, తాండూర్, కాసిపేటలోని 40 మంది ఎరువుల డీలర్స్ కు L1 రకం కొత్త ఈపీఓఎస్ మెషిన్స్ ను జిల్లా వ్యవసాయ అధికారి కల్పన అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. డీలర్స్ విధిగా మెషిన్ వాడి ఎరువులు అమ్మాలన్నారు.

ఎరువుల నిలువ అమ్మకం వివరాలు ఎప్పటికప్పుడు మెషిన్ లో అప్లోడ్ చెయ్యాలని కోరారు. స్టాక్ వివరాలు అప్లోడ్ చెయ్యని డీలర్స్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజా నరేందర్, బెల్లంపల్లి వ్యవసాయ అధికారి ప్రేమాకుమార్, తాండూర్ వ్యవసాయ అధికారి సుష్మ, కాసిపేట వ్యవసాయా అధికారి ప్రభాకర్, జిల్లా సాంకేతిక వ్యవసాయ అధికారి శ్రీనివాస్, బెల్లంపల్లి  ఏఈఓ సిహెచ్ తిరుపతి, డీలర్స్ పాల్గొన్నారు.