calender_icon.png 19 June, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త రేషన్ కార్డుల దందా!

19-06-2025 12:00:00 AM

  1. మధ్యవర్తులుగా కంప్యూటర్ ఆపరేటర్లు, మీసేవ కేంద్రాల నిర్వాహకులు 
  2. అప్లికేషన్ ఫైల్ తో పాటు పైసలు పంపితేనే వారంలోపు కార్డు మంజూరు
  3. పైసలు ముట్టకపోతే క్షేత్రస్థాయి విచారణ అంటూ కాలయాపన 
  4. ఆఫీసులో చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్న ప్రజలు
  5. కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హత

రంగారెడ్డి, జూన్ 18( విజయ క్రాంతి ): రంగారెడ్డి జిల్లాలో కొత్త రేషన్ కార్డుల దందా మొదలైంది. గత పదేళ్లుగా  కొత్త రేష న్ కార్డుల కోసం కండ్లు కాయలు కాసేలా అర్హులైన జిల్లా ప్రజలంతా ఎదురుచూపులు చూశారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. దీంతో పరుగో పరుగున జిల్లాలోని 21 మండలాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్ లో ప్రజలంతా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

తీరా దరఖాస్తు ఫారం తీసుకొని మండల రెవెన్యూ, మున్సిపాలిటీ కార్యాలయం,కార్పొరేషన్ లో పత్రా లను అందజేస్తే నిబంధనల పేరు చెప్పి రెవె న్యూ అధికారులు ముప్పు తిప్పలు పెడుతున్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి కనిక రించని చందంగా జిల్లాలో రెవెన్యూ సిబ్బం ది పరిస్థితి మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కడ్తాల,తలకొండపల్లి,ఆమనగల్, మాడుగుల, షాద్నగర్,చేవెళ్ల, రాజేంద్రనగర్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గం  కేంద్రా లలో కొత్త రేషన్ కార్డుల దందా బహటంగానే కొనసాగుతుందని పలు ఆరోపణ లు సైతం  పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ పథకాలు అమలు కోసం 6 గ్యారంటీ ల పేరుతో గ్రామాలు, మండలాలు,మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లో ప్రత్యేక సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు.తీరా అట్టి దరఖాస్తులను తీసుకొని మూలకు పడేశారు.

ఇప్పటివరకు ఆ దరఖాస్తులను పరిశీ లించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. అట్టి దరఖాస్తులు బుట్ట దాఖలైనట్లు పెద్ద ఎత్తున ప్రతిపక్షాల నుంచి ఆరోపణ సైతం వినిపించాయి. ప్రజా పాలనలో మెజార్టీగా రేషన్ కార్డుల కోసమే దరఖాస్తులు వచ్చా యి. ఇటీవలనే మళ్లీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ప్రకటన చేయడంతో కార్డు లేని వారిలో  ఆశలు చిగురించాయి.

కొత్త రేషన్ కార్డు కోసం మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్షేత్రస్థాయి విచారణ పేరిట రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తూ దాటవేస్తున్నారు. దరఖాసుదారుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని కార్యాలయంలో పనిచేసే ఆపరేటర్లు మీసేవ కేంద్రాల నిర్వాహకులు దళారుల అవతారం ఎత్తి మండల గ్రామ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాను బట్టి కార్డుకు  ధర నిర్ణయించి  గ్రామీణ ప్రాంతాల్లో రూ.3,000 నుంచి  పట్టణ ప్రాంతాల్లో పది వేల వరకు వసూలు చేస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దరఖాసుదారులు చేతులు తడిపితే పక్షం రోజులోనే రేషన్ కార్డు జారీ అవుతున్నాయి... ఇదే అదునుగా భావించిన రెవెన్యూ అధికారులు పౌరసరపాధికారులు సైతం మధ్యవర్తుల ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి రేషన్ కార్డులకు సిఫార్సులు చేస్తున్నారు... లేకపోతే రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉంచుతున్నారు.అధికారులను తమ రేషన్ కార్డు గురించి ఆరా తీయగా.... క్షేత్రస్థాయి విచారణ చేయాలి మళ్లీ మీ దరఖాస్తులు తీసుకురావాలంటూ  ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు.

లక్షకు పైగా కొత్త దరఖాస్తులు.......

 ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలు అర్హత పొందాలన్నా రూ.500కే గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇల్లు 2 00 యూనిట్ల ఉచిత విద్యుత్తు, పింఛన్ ఇలా ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలకు రేషన్ కార్డుతో ముడిపడిఉంది. దీంతో రేషన్ కార్డులకు మరింత ప్రాధా న్యం పెరిగింది. రేషన్ కార్డు లేని నిరుపేదలంతా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అందక గత పదేళ్లుగా  అరి గోస  పడుతున్నారు.

ప్రభుత్వం ఇటీవలనే రేషన్ కార్డుల దరఖాస్తు కోసం లింకు ఓపెన్ చేయడంతో దాదాపుగా జిల్లాలో లక్షకు పైగా దర ఖాస్తులు వచ్చాయి. పదేళ్ల  నుంచి రేషన్ కార్డులు గత ప్రభుత్వం మంజూరు చేయకపోవడంతో రేషన్ కార్డుల కోసం విపరీ తంగా తాకిడి పెరిగింది. ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు కొడుకులు పెళ్లిళ్లు వారికి పుట్టిన సంతానం, కుటుంబాలు ఇలా ప్రతిపల్లె, పట్టణంలో ఇదే పరిస్థితి ఏర్పడింది.

ఇప్పటివరకు రేషన్ కార్డుల దరఖాస్తుల్లో క్షేత్రస్థాయి విచారణ 15% మించి అధికారులు పూర్తి చేయ లేకపోయారు. కొత్త రేషన్ కార్డు జారీ ప్రక్రి య కోసం  జిల్లా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తే పని ఒత్తిడి.. ఇటీవలనే గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల కారణంగా రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన కొంత జాప్యం జరిగిన  మాట వాస్తవమేనని త్వరలోనే  క్షేత్రస్థాయి విచారణ చేసి  అర్హులైన వారికి కార్డుల జారి కి వేగంగా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.