26-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
బైంసా, జూలై 25: నూతన రేషన్ కార్డుల పంపిణీతో అరులైన పేద ప్రజలందరికీ మేలు చేకూరిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శుక్రవారం ముధోల్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుడు పవార్ రామారావు పటేల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నూతన రేషన్ కార్డుల జారీతో పేద ప్రజలకు ఉచిత రేషన్ బియ్యం అందుతాయని అన్నారు.
ముధోల్ నియోజక వర్గానికి సంబంధించి 11,352 నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 17609 మంది కుటుంబ సభ్యుల పేర్ల మార్పు, చేర్పులు జరిగాయని అన్నారు. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో రేషన్ కార్డులు లేని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, ఇక నుంచి ఆ సమస్యలు తీరిపోతాయని చెప్పారు.
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డుల పంపి ణీ చాలా సంతోషకరమైన విషయమని తెలిపారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి రేషన్ బియ్యాన్ని అందిస్తున్నాయని తెలిపారు. ప్రజలు ఈ ఉచిత బియ్యాన్ని బయట అమ్ముకోకుండా, వినియోగించుకోవాలని కోరారు. చాలా ఏండ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు ఇవ్వడం మంచి విషయం అని పే ర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమ ల్ రెడ్డి, జిల్లా పౌరసరఫరా శాఖ అధికారి రాజేందర్, తహసిల్దార్ శ్రీలత, ఎంపీడీఓ శివకుమార్, లబ్ధిదారులు, రేషన్ డీలర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జీపీవో, లైసెన్సుడ్ సర్వేయర్ల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నిర్మల్: 27న జరగబోయే గ్రామ పాల నా అధికారులు (జీపీవో), లైసెన్స్డ్ సర్వేయర్ల నియామక పరీక్షలను ఎలాంటి లోటుపా ట్లూ లేకుండా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణంలోని చాణక్య పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, మొత్తం 55 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఏడీ అధికారి సుదర్శన్, ఏవో సూర్యారావు, మోతిరాం, తదితరులున్నారు.