హామీ నెరవేర్చిన పెంచికల్పేట్ సర్పంచ్
02-03-2026 10:13 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): మండలములోని పెంచికలపేట గ్రామంలోని సర్పంచ్ షేక్ ఉస్మాన్ పద్మశాలి వీధిలో కొత్త నీటి బోరు ఏర్పాటు చేశారు. ఇచ్చిన హామీలు తప్పకుండా తీరుస్తామని, ప్రజా ప్రభుత్వం మనకి అండగా ఉంటుందని, సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నీటి సమస్యను తీర్చుటకై ఎమ్మెల్సీ దండె విఠల్ సహాకారంతో బోరు వేయిస్తున్నామని సర్పంచ్ తెలిపారు. రాబోవు వేసవివలో తమ దాహర్తి కష్టాలు నెరవేరాయని ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ షేక్ ఉస్మాన్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్యాల శేఖర్ కాంగ్రెస్ నాయకులు రౌతు తిరుపతి, లోంకరి రమేష్, మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు.




