8 June, 2026 | 6:20 PM

Breaking News

జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •   పగలైనా.. రాత్రైనా.. విద్యుత్ సమస్యలపై యోధుడిలా పోరాడే ‘కరెంట్ దేవుడు’ నరసింహ   •   రసాభాసగా మారిన వార్డు సభ సమావేశాలు   •  

రహదారులు రక్తసిక్తం.. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు

08-06-2026 05:07 PM

ఔరంగాబాద్ (బీహార్): బీహార్‌లోని ఔరంగాబాద్(Aurangabad) జిల్లాలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. గోహ్, ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురేసి చొప్పున, అలాగే ఒబ్రాలో ఇద్దరు, ఎన్‌టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) చెందిన పర్యాటకులతో బోధ్ గయ నుండి వారణాసికి వెళ్తున్న బస్సు ఒకటి, ఆదివారం రాత్రి వేళ NH-19పై ముఫస్సిల్ పోలీస్ స్టేషన్(Mufassil Police Station) పరిధిలో ఒక ట్రక్కును ఎదురెదురుగా ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.