రహదారులు రక్తసిక్తం.. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు
ఔరంగాబాద్ (బీహార్): బీహార్లోని ఔరంగాబాద్(Aurangabad) జిల్లాలో జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో(Road Accidents) కనీసం తొమ్మిది మంది మరణించగా, మరికొందరు గాయపడ్డారని అధికారులు సోమవారం తెలిపారు. గోహ్, ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురేసి చొప్పున, అలాగే ఒబ్రాలో ఇద్దరు, ఎన్టీపీసీ ఖైరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరు మరణించారు. ఆంధ్రప్రదేశ్కు(Andhra Pradesh) చెందిన పర్యాటకులతో బోధ్ గయ నుండి వారణాసికి వెళ్తున్న బస్సు ఒకటి, ఆదివారం రాత్రి వేళ NH-19పై ముఫస్సిల్ పోలీస్ స్టేషన్(Mufassil Police Station) పరిధిలో ఒక ట్రక్కును ఎదురెదురుగా ఢీకొట్టిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.






