calender_icon.png 20 June, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాచార శాఖ కమిషనర్ ను కలిసిన నిర్మల్ నేతలు

20-06-2025 04:46:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టాన్ని ప్రతీ కార్యాలయంలో కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్(Syed Haider) శుక్రవారం రాష్ట్ర కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. హైదరాబాదులో కమిషన్ కార్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డిని కలిసిన జిల్లా నేతలు సమాచార హక్కు చట్టం పట్ల నిర్లక్ష్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రలు తెలిపినట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినోద్ సాబీర్ తదితరులు ఉన్నారు.