calender_icon.png 20 June, 2025 | 9:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ బకాయిలు తక్షణమే చెల్లించాలి

20-06-2025 05:01:17 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) జిల్లా కో కన్వీనర్ మేడపట్ల నితిన్(District Co-Convenor Medapatla Nithin) డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో బెస్ట్ అవైలబుల్ స్కీం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ విద్యార్థులు 19వేలు, ఎస్టీ విద్యార్థులు 6వేల మంది వివిధ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారన్నారు. కానీ గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావడం లేదన్నారు. రెండు సంవత్సరాలకు 154 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయని తెలిపారు.

ప్రభుత్వం నుండి డబ్బులు రాకపోవడంతో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను పాఠశాలలకు రానివ్వడం లేదని అన్నారు. ఆయా పాఠశాలల యాజమాన్యాల బెస్ట్ అవైలబుల్ స్కీంకు ఎంపికైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫారం, ఇవ్వాల్సి ఉందని డబ్బులు చెల్లిస్తేనే ఇస్తామని అంటున్నారన్నారు. దీంతో దళిత, గిరిజన విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయి డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకమునుపే బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు కావాల్సిన బడ్జెట్ను కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు.