23-05-2025 12:00:00 AM
నిర్మల్, మే 22(విజయక్రాంతి): రాబోవు వర్షాల ప్రభావంతో జిల్లా ప్రజలకు ఎలాం టి ప్రమాదం తలెత్తకుండా, పోలీస్ శాఖ పరంగా తగిన ఏర్పట్లతో ముందస్తుగా పకడ్బందీ చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ జాన కి షర్మిల తెలిపారు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విపత్తు నిర్వహణ సిబ్బంది సమావేశం నిర్వహించి వానాకాలం సీజన్లో వర్షాలు వరదల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందికరకుండా యాక్షన్ ప్లాను రూపొందించుకోవాలని సూచించారు.
జిల్లాలో భారీ వర్షాల కారణంగా కడెం, స్వర్ణ, గడ్డన్న ప్రాజెక్టులు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరు కునే అవకాశం ఉంటుంది. గత సవత్సరం గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. భారీ వర్షాలతో జిల్లాలని లోతట్టు ప్రాంతాలు జలమయం అయినపుడు వారిని కాపాడేందుకు జిల్లాలో ఎయిర్ బోరడ్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్ మరియు రోప్ అన్నిటిని సిద్ధం చేయటం జరిగింది.
జిల్లాలో అనుకోని విపత్తులు ఏర్పడినప్పుడు ప్రాణహాని కలగ కుండా వారిని కాపాడటం కోసం అన్ని చర్యలు తీసుకోవటం కోసం ముందస్తుగా సంబంధిత అధికారులతో తనిఖీ నిర్వహించటం జరిగింది. నిర్మల్ జిల్లాలో అతి భారీ వర్షాల వల్ల వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎయిర్ బోరడ్స్, లైవ్ జాకెట్స్, ట్యూబ్స్ మరియు రోప్ వస్తువులు పోలీస్ శాఖ వారి కి చాలా అవసరం కాబట్టి వాటిపై ఈ నెల లో పోలీస్ సిబ్బందికి నిష్ణాతుల చేత శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అని చెప్పారు.
గతంలో 70 మందికి శిక్షణ ఇవ్వటం జరిగిం ది. జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వారిని పోలీస్ వారు వారి ప్రాణాన్ని పణం గా పెట్టి రోప్తో, లైవ్ జాకెట్తో రిస్క్ చేసి కాపాడటం కోసం ఈ శిక్షణ ఎంతో అవస రం అని సూచించారు.
మన వద్ద ఉన్న ఎయిర్ బోరడ్స్ సులువుగా, సిబ్బందికి కష్టం కలగకుండా వారిని కాపాడవచ్చును అన్నారు. గత సవత్సరం వచ్చిన వరదల నష్టాలను దృష్టిలో ఉంచుకుని మరియు రాబోవు వర్షాల దృస్ట్య అం దరు పోలీసు అధికారులు సమాయత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐలు రామ్ నిరంజన్, రమేష్, అర్.ఎస్. ఐలు రవి కుమార్, రాజశేఖర్, సాయికృష్ణ, స్పెషల్ పార్టీ సిబ్బంది, శివంగి టీం తదితరులు పాల్గొన్నారు