2 June, 2026 | 1:11 AM

జేఈఈ అడ్వాన్స్‌లో నిర్మల్ విద్యార్థుల ప్రతిభ

02-06-2026 12:32 AM

నిర్మల్, జూన్ 1 (విజయక్రాంతి): జేఈఈ అడ్వానస్డ్ 2026 పరీక్షా ఫలితాల్లో నిర్మల్కు చెందిన వాసవి విద్యాసంస్థల విద్యార్థులు అ త్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఘన విజయాన్ని సాధించారు. కఠినమైన శిక్షణ, నిరం తర కృషి ఫలితంగా చిరుమాని ధీరు భరత్ (AIR 234), బోడం రిష్విత్ రెడ్డి (AIR 104 61), యథాలం దీక్షిత్ రెడ్డి (AIR 2422), మంజులాపూర్ సన్నిధ (AIR 2745), రత్నాపురం అనుధి (AIR 3139) మంచి ర్యాం కులతో జేఈఈ అడ్వాన్స్డో్ల క్వాలిఫై అయ్యారు.

విద్యార్థుల ఈ విజయం వారి పట్టుదలకు, తల్లిదండ్రుల సహకారానికి మరియు వాసవి విద్యాసంస్థల ప్రత్యేక శిక్షణకు నిదర్శనమని యాజమాన్యం పేర్కొంది. ఈ సంద ర్భంగా విద్యార్థుల ప్రతిభను వాసవి విద్యాసంస్థల సెక్రటరీ జగదీష్ రెడ్డి మరియు కరస్పాండెంట్ పోతా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ శెట్టి, రాజ్ కుమార్, సుహాసిని, శైలజా జైసన్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొని విద్యార్థులను అభినందించారు..