అనుమతుల ప్రక్రియలో జాప్యం వద్దు
పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలి
సీఎంసీ కమిషనర్ జీ సృజన
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంపై కమిష నర్ జీ సృజన దృష్టి సారించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం నుంచి అక్రమ నిర్మాణాల నియంత్రణ వరకు పలు కీలక అంశాలపై అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల విషయంలో ఉదాసీనత వహించవద్దని, తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్పొరే షన్ పరిధిలో పెండింగ్లో ఉన్న భవన అనుమతులు, కోర్టు కేసుల వివరాలను కమిషన ర్ ఆరా తీశారు.
అనుమతుల ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. లేఅవుట్ రెగ్యుల రైజేషన్ స్కీమ్ కింద వచ్చిన దరఖాస్తుల పురోగతిని ఆమె సమీక్షించారు. బాధితులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని ఆదేశించారు.




