30-06-2025 01:28:56 AM
చివరగా ప్రజలు మంచి చేసింది నమ్ముతారు..
విలేకరుల సమావేశంలో మాజీమంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
జడ్చర్ల జూన్ 29 : బాధ్యతగల పదవిలో ఉండి అసత్య ఆరోపణలు చేయడం మానేసి మంచి పనులకు తావు ఇవ్వాలని మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జడ్చర్ల పట్టణంలో ప్రేమ్ రంగా గార్డెన్స్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదన్నారు. గతంలో జడ్చర్లలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదన్నారు. వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం నేను రెండు ఎకరాలు ఇవ్వడం జరిగిందని,ఎమ్మెల్యే పక్కన ఉన్న మరో రెండు ఎకరాలు ఇప్పించాలన్నారు.ప్రభుత్వం మీది ..బిఆర్ఎస్ నేతల అవినీతి, కబ్జాలు నిరూపించాలన్నారు. నిరూపిస్తే పార్టీపరంగా కూడా చర్యలు తీసుకుంటామని, బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.
నా రాజకీయ జీవితం లో అవినీతి చేయలేదన్నారు. జడ్చర్ల నియోజకవర్గం లో చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని వారికి డబ్బులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సొంత గ్రామం లో కూడా ఇదే విధంగా చేశామని తెలిపారు. హాస్పిటల్ రోడ్డు నిర్మాణం కోసం అయ్యే ఖర్చు భరిస్తానని తెలిపారు.పాత బజారు కి భారీ వాహనాలు వెళ్లాడానికి ఎటువంటి ఇబ్బంది లేదని..
అంబేద్కర్ చౌరస్తా వద్ద డివైడర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు.స్లో అయ్యి రైట్ తీసుకొని వెళ్లొచ్చన్నారు.ఎర్రగుట్ట లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు దక్కాలన్నారు. అర్హులైన వారికి కేటాయించి మిగతా వారిని ఖాళీ చేయిస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు.ఎన్నికల తరువాత ఇండ్లను కొంతమంది ఆక్రమించుకుంటే మాకేం సంబంధన్నారు. అధికారులు విచారణ చేపట్టి నిజమైన లబ్దిదారులకు ఇండ్లు కేటాయించాలన్నారు.
ఉద్దండపూర్ పరిహారం విషయం లో ఎలాంటి అవకతవకలు జరగలేదని...కెసిఆర్ గారిని ఒప్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ముప్పు శాతం పెంచామని గుర్తు చేశారు.మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల పరిహారం ఇప్పించాలని కోరారు. అందరి సంక్షేమ కోసం గత ప్రభుత్వం పనిచేసిందని తెలిపారు.