30-06-2025 01:27:11 AM
వనపర్తి, జూన్ 29 ( విజయక్రాంతి ) : ప్రజా సమస్య ల పరీక్షరానికి పోరాటాలు చేయడం బి ఆర్ ఎస్ పార్టీకి కొత్త ఏమి కాదని పోరాటస్పూర్తికి బ్రాండ్ అంబాసిడర్ బి.ఆర్.ఎస్ పార్టీ.అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం లో పట్టణ అధ్యక్షులు రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన పట్టణ పార్టీ విస్తృతస్థాయి సమావేశంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు.
ముందుగా మాజీ రాష్ట గిడ్డంగుల ఛైర్మెన్,ప్రముఖ గాయకులు సాయిచంద్ ద్వితీయ వర్ధంతి సందర్భంగా వారికి మౌనం పాటించి సంతాపం, నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని ఉన్న కొద్ది సమయములో చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి సాధించామని నాయకులు వార్డులో పర్యటించి మనం చేసిన అభివృద్ధి గుర్తుచేయాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు అపనమ్మకంతో ఉన్నారని ప్రజలు మళ్ళీ బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కె సి.ఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నిత్యం అసత్యాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతే బి.ఆర్.ఎస్ పార్టీ నిత్యం నిజాలు చెప్పి అభివృద్ధి చేసి చూపిందన్నారు.
మన హయాములో జిల్లా కేంద్రం లో జరిగిన విద్య, వైద్యం, రవాణ వ్యవస్థ అయిన రోడ్ల విస్తరణ,చెరువుల పునరుద్ధరణ, ఐ.టి.టవర్,జె.ఎన్.టి.యు కాలేజ్,ఎకో పార్క్, అర్ధచంద్రాకారంలో బైపాస్,మెడికల్ కాలేజ్,మాత శిశు సంరక్షణ కేంద్రం వంటి ఉన్నత అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు.మనం చేసిన అభివృద్ధి మరియు కాంగ్రెస్ పార్టీ 18 నెలలో చేసిన అభివృద్ధి బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలని ప్రజలను అభ్యర్థించాలని దిశా నిర్దేశం చేశారు.
ప్రజలలో ఉండి ప్రజాసమస్యల పట్ల నిత్యం పోరాటం చేస్తున్న నాయకులను పార్టీ గుర్తిస్తుందని,పార్టీ పట్ల నిబద్ధత నాయకుని పట్ల విధేయత ఉన్న అభ్యర్థులను పార్టీ నిర్ణయిస్తుందని అందుకే తన చుట్టూ తిరగడం మాని ప్రజల చుట్టూ తిరగాలని సూచించారు.ఈ సమావేశములో జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తదితరులు ఎన్నికల వ్యూహాలను వివరించారు.ఈ కార్యక్రమములో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,తదితర పట్టణ మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.