22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

ఎన్ని కుట్రలు చేసినా గెలుపు బీజేపీదే

22-04-2025 12:00 AM
  1. ఎంఐఎం గెలుపునకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ తపన
  2. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డా.లక్ష్మణ్

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంను గెలిపించేందుకే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటీ నుంచి తప్పుకున్నాయని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.

ఇన్నాళ్లు పాముకు పాలు పోసిపెంచినట్టు ఎంఐఎంను కాపాడుకుంటూ వచ్చిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయకుండా మరోసారి మజ్లిస్‌కు సహాయపడుతున్నాయని సోమవారం ఆయన ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ మూడు పార్టీలను బీజేపీ ఒక్కటే ఎదుర్కొంటుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్‌రావు గెలిచే అవకాశం ఉందని భావించి, బీఆర్‌ఎస్ పార్టీ తమ ఓటర్లను ఓటు వేయొద్దని పిలుపునివ్వడం దుర్మార్గమన్నారు.

ఓటు హక్కును కాలరాసేలా బీఆర్‌ఎస్ ప్రవర్తించడం సరికాదన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ రెండూ కూడా రాష్ట్ర రాజధానిలో జరుగుతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటే వారి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ మూడు పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా, తామే గెలవబోతున్నామని లక్ష్మణ్ స్పష్టం చేశారు.