calender_icon.png 16 December, 2025 | 2:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హద్దు దాటితే ఎవరినైనా ఉపేక్షించేది లేదు: ఎస్ఐ రవి గౌడ్

15-12-2025 10:45:29 PM

కల్హేర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కల్హేర్ ఎస్ఐ రవి గౌడ్ సోమవారం పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ... మండల కేంద్రం, మండల పరిధిలో సోమవారం 15/12/2025 సాయంత్రం 5 గంటల నుండి తేది: 17/12/2025 బుధవారం రాత్రి 12 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కావున నలుగురు కంటే ఎక్కువమంది ఒక చోట గుమి గూడటం గానీ, తిరగటం గానీ నిషేదం పోలీంగ్ కు 44 గంటల ముందు నుండే ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలి, పోస్టర్స్, గుర్తు కండువాలతో ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని, గ్రామంలో ఎవరైనా తాగి న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది కలిగించిన తాట తీస్తామని, పోలింగ్ రోజు ఎవరైనా తాగి పోలింగ్ బూత్ లోకి వచ్చిన, న్యూసెన్స్ చేసిన, ఇతరులకు ఇబ్బంది చేస్తే ఎవరైనా ఊరుకునేది లేదు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐ రవి గౌడ్ హెచ్చరించారు.