14-06-2025 12:00:16 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లలో ప్రవేశాలకు మూడు అంచెల్లో ఎంపిక విధానం ఉంటుందని మహబూబాబాద్ జిల్లా యువజన క్రీడల అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంకు గాను నాలుగవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 15 వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు ఆన్లైన్ లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పాల్గొనుటకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఈనెల 16 నుంచి 19 వరకు మండల స్థాయి, 23 నుంచి 26 వరకు జిల్లా స్థాయి, జూలై 1 నుంచి 5 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపిక పోటీలు ఉంటాయని చెప్పారు.
హకీంపేటలో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు, కరీంనగర్ లో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు, ఆదిలాబాద్ లో 20 సీట్లు బాలికలకు, 20 సీట్లు బాలురకు ఉండగా మొత్తం 120 సీట్ల భర్తీకి ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. 01-09-2016 నుంచి 30-08-2017 మధ్య జన్మించి 8 నుంచి 9 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు tgss.telangana.gov.in వెబ్సైట్లో వివ రాలు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94406 30681 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని డివైఎస్ఓ జ్యోతి కోరారు.