15 June, 2026 | 11:05 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

స్టార్ హీరోలు కాదు.. నా పాత్రే ముఖ్యం

24-08-2024 12:41 AM

‘నేను అగ్ర హీరోల సినిమాల్లో నటించినా అందులోని నా పాత్ర ప్రాధాన్యతే నాకు ముఖ్యం’ అంటోంది బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్. ఇటీవల ఈ భామ నటించిన ‘స్త్రీ2’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.400 కోట్ల వసూలు చేసిందనేది తాజా వార్త. ఈ సినిమాలో తనదైన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న శ్రద్ధా కపూర్  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

బాలీవుడ్‌లోని ముగ్గురు ఖాన్‌లతో కలిసి పనిచేసే అవకాశాలు వచ్చినా కొన్ని కారణాలతో నటించలేకపోయానని తెలిపింది. ‘చిత్ర పరిశ్రమలో మీకు వరుస అవకాశాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ ప్రాజెక్టులో మీరు పోషించే పాత్రకు ప్రాధాన్యత ఉండి.. అది మిమ్మల్ని సవాలు చేసేలా ఉంటేనే అంగీకరించండి. లేకపోతే అందులో ఎంత పెద్ద స్టార్ నటించినా వదిలేయండి. నేను ఎంచుకునే పాత్రల విషయంలో నాకు చాలా స్పష్టత ఉంది. మంచి కథలతో ప్రేక్షకులను ఆకర్షించేందుకు అద్భుతమైన దర్శకులతో పనిచేయాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది శ్రద్ధ.