calender_icon.png 27 June, 2025 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదంలో పంచాయతీ భవనం

27-06-2025 02:03:38 AM

నిర్లక్ష్యం కారణంగా వివాదంలోకి

కరీంనగర్, జూన్ 26 (విజయ క్రాంతి): ప్రైవేట్ స్థలంలో గ్రామ పంచాయతీ భవనం నిర్మించడంతో వివాదంలో చిక్కుకుంది. బొ మ్మకల్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో గ్రామంలోని సర్వే నెం. 17లో ము స్కాన్ బిల్డర్స్  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి గ్రామ పంచాయతీ భవనానికి 3 గుం టల భూమి లేఅవుట్ కింద వదిలేశారు. వా రి బ్రోచర్లో కూడా గ్రామ పంచాయతీ భవ నం చూపినారు. అనంతరం అన్ని ప్లాట్స్ వి క్రయించారు. తర్వాత గ్రామ పంచాతీ భవన నిర్మాణం 3 స్లాబ్లు వేశారు.

దీనికి అప్పటి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ నుంచి కరెంట్ మీటర్ తీసుకొని మోటార్ కూడా వేసినారు. దీనికి 2 లక్షల 12 వేలు, స్లాబ్కు 8 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుంచి చెల్లించారు. కానీ ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పేరున రిజ్రిస్టేషన్ చేయలేదు. 2024 జనవరి 26న మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా ఓపెనింగ్ చేశారు. దీనికి పాలకవర్గం మొత్తం హాజరయింది. కానీ గ్రామ పంచాయతీ గడువు ముగిసినందున ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

బొమ్మకల్ భూముల వ్యవహారాలు వివాదంలో ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వ స్థలం, పాత గ్రామ పంచాయతీ ఆవర ణలో నూతన భవన నిర్మించకుండా విక్రయదారు ప్రైవేట్ స్థలం లో నిర్మించడం ఇప్పుడు వివాదమయింది. అగ్రిమెంట్ కాగితాలున్నా అది రిజిస్ట్రేషన్ కాకపోవడంతో సదరు బిల్డర్ ఈ స్థలం మాది కాదని, ఇతరుల పేరుమీద ఉందని, మాకు సంబంధం లేదని దాట చేస్తున్నారు. మాజీ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ ఈ భవన ని ర్మాణ సమయంలో ఎలాంటి అనుమతులు డీపీవో నుండి తీసుకోకుండానే పంచాయతీ పేరుపై రిజిస్ట్రేషన్ చేయకుండానే పదవీకాలం ముగుస్తున్నందున తొందరలో మం త్రి పొన్నం ప్రభాకర్ తో ప్రారంభోత్సవం గావించారు. బొమ్మకల్ గ్రామం నగరపాలక సంస్థలో విలీనమయింది. 

ఈ గ్రామంతోపాటు కరీంనగర్ రూరల్ మండల పరిధిలోని దుర్శేడ్, గోపాల్పూర్ గ్రామాలు కూడా వి లీనం కాగా అక్కడి పంచాయతీ భవనాలను నగరపాలక సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుంది. బొమ్మకల్ కు వచ్చేసరికి ఈ నూతన భవనం గ్రామ పంచాయతీ పేరుమీద లేకపోవడంతో వదిలిపెట్టారు. అయితే పంచాయతీ నిధులతో నిర్మించిన ఈ భవనా న్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించకుంటే ఈ భవనం నగరపాలక సంస్థకు చెందకుండా పోయే ప్రమాదం ఉం ది. పంచాయతీకి చెందిన మాజీ వార్డు స భ్యులు గూడ తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, తోట కిరణ్ కుమార్, వరాల శ్రీనివాస్ లు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు, నగరపాలక సంస్థ కమిషనర్ కు ఈ విషయమై ఫిర్యాదుచేశారు.