16-06-2025 11:16:16 PM
కొండపాక: ఉపాధి హామీ పనుల పరిశీలనలో భాగంగా సోమవారం కేంద్ర ప్రభుత్వ ఎంఎన్ఆర్ఈజిఎస్ బృందం(Central Government MGNREGS Team) కుకునూరు పల్లి మండలంలోని ముద్దాపూర్, కుకునూరుపల్లి, కొండపాక గ్రామంలో లలో పర్యటించి ముద్దాపూర్ లో ఫిష్ పాండ్, కుకునూర్ పల్లి లో భూమి చదును పనులు, కొండపాకలో భూమి చదును, మొరం రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం మినర్వా హోటల్ లో జిల్లా కలెక్టర్ కే. హైమావతి తో జిల్లాలో పర్యటించిన సందర్భంగా పరిశీలించిన వివిధ పనుల ప్రగతిపై చర్చించారు. ఈరోజు పరిశీలించిన పనులు సంతృప్తికరంగా ఉన్నాయని పనులన్నీ కూడా ప్రయోజనకరంగా ఉంటాయని ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేర్యాల పెయింటింగ్స్ ను జిల్లా కలెక్టర్ ఎన్ఆర్ఈజీఎస్ డైరెక్టర్ కు అందజేశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమ అగర్వాల్ డిఆర్డిఓ జయదేవ్ ఆర్య తదితరులు ఉన్నారు.