17-06-2025 12:00:00 AM
భైంసా, జూన్ 16 (విజయక్రాంతి): బైం సా డివిజన్లోని కుబీర్ మండలం మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బెల్గాం తండాలో సోమవారం ఎలుగుబంటి హల్చల్ చేసింది. అడ విలో నుంచి రోడ్డుపైకి వచ్చిన ఎలుగుబంటి చూసిన ప్రజలు భయంతో కేకలు వేయడం తో అది తిరిగి సమీపంలోని అడవిలోకి వెళ్లిపోవడంతో గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చు కున్నారు. అడవి సమీపంలో ఉన్న పంట పొలాల రైతులు ఎక్కడ దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.