calender_icon.png 17 June, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసించనున్న గిరి గ్రామాలు..!

17-06-2025 12:00:00 AM

- అదివాసీల గ్రామాల అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

- పీఎంజుగా ద్వారా సకల సౌకర్యాలు

- ఈనెల 30 వరకు అవగాహన కార్యక్రమాలు

- 17 శాఖల భాగస్వామ్యంతో ప్రణాళిక

- విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక వసతులే ప్రత్యేక ఏజెండా

- గిరిజనులకు అవగాహన కల్పిస్తాం:-కలెక్టర్ వెంకటేష్‌ధోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్1౬ (విజయక్రాంతి): గిరిజనుల సామాజిక, ఆర్థికాభి వృద్ధిపై కేంద్రం దృష్టిసారించింది. ఏజెన్సీ లు, మైదాన ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల పరిధిలో 4జీ సర్వీసులు, అన్ని గ్రామాలకు వంద శాతం విద్యుదీకరణ చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా జిల్లాలోని 102 గిరిజన ఆవాసాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం, జీవనోపాధి,నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను చేపట్ట నుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే  మొత్తం నిధులు కేటాయించనుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న పీఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ను ఉన్నతీకరించి ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్‌గా మార్చి గిరి గ్రామాల అభివృద్ధికి కేంద్రం మరో అడుగు వేసింది.

ఐదేళ్ల ప్రణాళికతో ముందుకు:

రానున్న ఐదేళ్ల కాలంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని గిరిజనుల సామాజిక, ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ పథ కం కింద ఐదేళ్లలో దేశవ్యాప్తంగా రూ. 79,156 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపిం ది. పథకం వివరాలను ముసాయిదా రూపొందించారు. ఇందులో భాగంగా 17 ప్రభుత్వశాఖలు ఆయా ప్రాజెక్టులు చేపట్టనున్నాయి.

వివిధ శాఖలు ఆయా గ్రామాలలో కావలసిన మౌ లిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి సంబంధిత శాఖకు నివేదిక అం దించనున్నారు.ఇందుకోసం ఈనెల 30వ తారీఖు వరకు జిల్లాలో ఎంపికైన 102 గ్రామాలలో అవగాహ న సదస్సులు చేపట్టనున్నారు.జిల్లా, మండలస్థాయి లో కమిటీలు మౌలిక సదుపాయాలు, ఇతర పనుల ప్రతిపాదనలు గిరిజన సంక్షేమశాఖ ద్వారా పంపించనున్నాయి. పీఎంజుగా కార్యక్రమాలకు ప్రత్యేక విధివిధానాలు  రూపొందిం చారు. గిరిజన జీవన పర్యాటకం కోసం స్వదేశీదర్శన్ పేరిట నూరు శాతం నిధులతో హోం స్టే గృహాలు నిర్మించనున్నారు.

కేంద్రం చేపట్టే పనులు - 

కరెంటు లేని గిరిజన ఆవాసాల్లో కుటుంబాలు, ప్రభుత్వ విభాగాలకు విద్యుత్తు సౌకర్యం, రహదారుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది.ఏజెన్సీ ప్రాంతాల్లో 5 కి.మీ., మైదాన ప్రాంతాల్లో 10 కి.మీ. దూరం లో హెల్త్సెంటర్ లేకుంటే సంచార మెడికల్ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. గిరిజన కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డుల పంపిణీ చేస్తుంది.గిరిజన రైతుల సుస్థిర వ్యవసాయ కార్యక్రమాల కోసం నిధుల కేటాయింపు చేస్తారు.

పశుపోషణ కార్యక్రమాలు చేపట్టను న్నారు. ఇప్పటివరకు అమలైన పీఎం జనజా తి ఆదివాసీ న్యాయమహా అభియాన్ కింద గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి మహిళాశిశు సంక్షేమశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పాత నిబంధనల ప్రకారం కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం నిధులు భరించాలి. కానీ కొత్త నిబంధనల ప్రకారం పూర్తి నిధులు కేంద్రమే భరిస్తుంది. గిరిజన ప్రాంతాల్లో కొత్త అంగన్వాడీ కేంద్రాలకు రూ.12 లక్షల చొప్పున నిధులివ్వనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న కేంద్రాల ఉన్నతీకరణకు రూ.లక్ష చొప్పున అందించనుంది.

ప్రతి గ్రామానికి ప్రత్యేక అధికారి

జిల్లాలో పీఎం జూగా పథకం కింద 102 గిరిజన గ్రామాలుఎంపిక చేయడం జరిగింది. ఈ గ్రామాలకు ప్రత్యేక అధికారులుగా ఎస్సీ ఆర్పీలను నియమించడం జరిగింది.17 శాఖల సమన్వ యంతో గిరిజన గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను తయారుచేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.

 రమాదేవి, డిప్యూటీ డైరెక్టర్

మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు

కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన పీఎం జూగా పథకం  గిరిజన గ్రామాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. విద్యుత్ లేని గిరిజన గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయ డం జరుగుతుంది సాధ్యం కాని చోట సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేస్తాం. విద్య, వైద్యం, కనెక్టివిటీ రోడ్స్ ఇలా అనే క మౌలిక సదుపాయాలను సమకూర్చడం జరుగుతుంది.ఇప్పటికే అవగాహ న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఐదేళ్ల ప్రణాళికతో ముందుకు సాగడం జరుగుతుంది.

 వెంకటేష్ ధోత్రే, కలెక్టర్