16-11-2025 11:26:37 AM
ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన దొడ్డ సమ్మయ్య-శ్రీదేవి దంపతులు (ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ సోదరుడు). అడవి శ్రీరాంపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ కోదండ రామాలయం, అయ్యప్ప స్వామి దేవాలయానికి రూ.1.50.000 ఒక లక్ష యాభై వేల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ.. ఇంత విరాళం ఇచ్చినందుకు వారి కుటుంబానికి గ్రామస్తులు ఆలయ కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు.