15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కాలనీలో కలియతిరిగి.. సమస్యలు తెలుసుకుని..

16-11-2025 09:31 AM

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ మార్నింగ్ వాక్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు పటేల్ ప్రతి కాలనీలో కలియ తిరిగి ఇంటింటికి సమస్యలు తెలుసుకుని ప్రజలతో మమేకమయ్యారు. ఉదయాన్నే తమ కాలనీలో ఎమ్మెల్యే కనబడడంతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురై ఆనందపడ్డారు. తమ కాలనీలలో ఉన్న మురికి నీరు వ్యవస్థ, మిషన్ భగీరథ మంచినీటి అవస్థలను, రోడ్ల పరిస్థితులను స్థానికులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. వాటిని రాసుకున్న ఎమ్మెల్యే వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, జన్నారపు శంకర్, తదితరులు ఉన్నారు.