calender_icon.png 29 July, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిథిలావస్థలో నర్సింగ్ హాస్టల్

28-07-2025 08:11:56 PM

వరంగల్ (విజయక్రాంతి): తెలంగాణ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్న ఎంజీఎం ఆసుపత్రి(MGM Hospital)లో నర్సింగ్ విద్యార్థులకు మౌలిక వసతులు కరువయ్యాయని, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి నర్సింగ్ విద్యార్థులు విధులు నిర్వహించి, నిద్రిస్తుండగా పై అంతస్తులోని పెచ్చులూడి ఓడిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విద్యార్థులు వాపోతున్నారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని సీనియర్ డాక్టర్లు, విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుండి నర్సింగ్ కోర్స్ విద్యను అభ్యర్థిస్తూ ఎంజీఎం ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో విద్యార్థులు విధులు నిర్వహిస్తున్నారు.

నర్సింగ్ విద్యార్థులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పలుసార్లు ఆర్ఎంఓ కు ఆసుపత్రి సూపర్డెంట్ లకు వినతి పత్రాలను సమర్పించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మరమ్మత్తుల కోసం విధులు మంజూరైనప్పటికీ మరమ్మత్తులను చేయించకుండా అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఏదేమైనాప్పటికీ అర్ధరాత్రి పైకప్పు పెచ్చులు ఉండడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని నిధులు కేటాయించి కొత్త భవనం నిర్మించాలని విద్యార్థులు ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.