16-02-2026 10:27:25 AM
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన పురపోరులో ఇవాళ అంతిమఘట్టం పూర్తి కానుంది. సోమవారం నాడు మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ చైర్ పర్సన్లు ఎన్నిక కానున్నారు. ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్ ఛైర్ పర్సన్లు, వైస్ ఛైర్ పర్సన్ల ఎన్నికల జరగనుంది. 116 మున్సిపాల్టీల్లో 2,594 మంది కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈనెల 11న 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి.