జనజాతర సభాస్థలం పరిశీలన

02-05-2024 01:29:21 AM

రాజన్న సిరిసిల్ల, మే 1 (విజయక్రాంతి): ఈ నెల 3న సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనే సిరిసిల్ల జనజాతర సభ స్థలాన్ని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, కాంగ్రెస్ నాయకులు, పోలీసులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లు, హెలిప్యాడ్, బందోబస్తు, తాగునీరు. నీడ తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.