నరేంద్ర మోదీతోనే దేశానికి ధీమా

02-05-2024 01:27:41 AM

భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ 

రాజన్న సిరిసిల్ల, మే 1(విజయక్రాంతి): దేశానికి మోదీ పాలనతోనే ధీమా ఉంటుందని భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామ కృష్ణ అన్నారు. బుధవారం వేములవాడలో  భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా  ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్ర పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో మోదీ మార్కుతోనే భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. దేశంలోని బడుగు బలహీన వర్గాలకు భాజపా అండగా ఉంటుందన్నారు. ఈ నెల 8న వేములవాడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని తెలిపారు. మోదీ బహిరంగ సభకు తరలిరావాలని కోరారు.