calender_icon.png 18 October, 2025 | 7:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హీరోయిన్ల దొంగ ఓట్ల ప్రచారంపై కేసు

17-10-2025 10:35:21 AM

  1. ఓటర్ల జాబితాపై ఫేక్ న్యూస్‌పై ఈసీ కొరడా.
  2. నటీమణుల పేర్లతో తప్పుడు సమాచారం.
  3. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు.
  4. తప్పుడు ప్రచారం చేసినా, షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవు.
  5. ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి, కర్ణన్.

హైదరాబాద్, సిటీ బ్యూరో,(విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(Jubilee Hills by-election) వేళ ఓటర్ల జాబితాపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎన్నికల అధికారులు ఉక్కుపాదం మోపారు. ప్రముఖ నటీమణుల రకుల్ ప్రీతి సింగ్, సమంత, తమన్నా భాటియాల, పేర్లతో నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదు చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని సృష్టించినా, ఇతరులకు షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు తీవ్రంగా హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యూసుఫ్‌గూడ సర్కిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ యాహియా కమల్ ఈ మేరకు మధురా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా సినిమా నటీమణుల ఫోటోలతో ఓటర్ కార్డులు సృష్టించి, అవి ఓటరు జాబితాలో ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాలలో(Social media) తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. AERO ఫిర్యాదు మేరకు, పోలీసులు క్రైమ్ నంబర్ 686/2025 కింద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 336(4), 353(1)(C) ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, ఇతరులకు షేర్ చేయవద్దని కోరారు. ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రచారాలు చేసినా, వాటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నా, బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు తీవ్రంగా హెచ్చరించారు.