calender_icon.png 18 October, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాస్ వర్క్ చేయలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్..

17-10-2025 10:38:40 AM

ఉద్దెమర్రి గుడ్ షెఫర్డ్ స్కూల్లో  

శామీర్ పేట్,(విజయ క్రాంతి): ఇటీవల కాలంలో చాలా మంది ఉపాధ్యాయులు విద్యార్థులు తప్పు చేస్తే వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. కానీ కొంత మంది టీచర్లు వారికి మెల్లగా చెప్పకుండా కోపంతో ఊగిపోతూ విద్యార్థులపై దాడికి పాల్పడుతున్నారు. హోంవర్క్ చేయలేదని ఏడేళ్ల బాలుడిని శోభారాణి అనే ఉపాధ్యాయురాలు చితకబాదింది. వివరాల్లోకి వెళితే... మూడుచింతలపల్లి మున్సిపాలిటీ ఉద్దెమర్రి గ్రామానికి చెందిన మహేష్ బాబు అదే గ్రామంలో గుడ్ షెపర్డ్ అనే ప్రైవేట్ స్కూల్ 8 వ తరగతి చదువుతున్నాడు. అయితే మహేష్ బాబు క్లాస్ వర్క్ చేయకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయురాలు శోభారాణి కర్రెలతో తీవ్రంగా కొట్టింది. వెంటనే బాలుడి నానమ్మ స్కూల్ కి వెళ్లి ప్రశ్నించగా అక్కడ టీచర్,  ప్రధానోపాధ్యాయుడు లేకపోవడంతో ఎంఈఓ భాగ్యమని కి ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ స్పందించి విచారణ చేపడతామని తెలిపారు.