15-05-2025 01:50:16 AM
ప్రారంభించి నెలలు గడుస్తున్న వాడకం లోకి రావడం లేదు
కల్లూరు,మే14(విజయ క్రాంతి): లక్షలు వేచించి నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను హంగు ఆర్భాటాలతో ప్రారంభించిన అధికారులు, కమ్యూనిటీ హాల్ వినియోగానికి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరుమండల పరిధిలో పేరువంచ గ్రామం పంచాయితీ ఎన్టీఆర్ కాలనీ లో నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హల్ ను నిర్మించారు.
కమ్యూనిటీ హాల్ లో ప్రారంభించిన అధికారులు పంచాయతీకి అప్పగించకపోవడంతో తాళాలు తెరిచే పరిస్థితి లేదు. కాలనీలోనివిద్యార్థులు కాంపిటిషన్ పరీక్షలకు చదువుకోవడానికి పొరుగు రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లైబ్రరీ కి వెళ్లి చదువు కోవాల్సి వస్తుందని.
అదే తమ గ్రామంలో నిర్మించిన కమ్యూనిటీ హల్ ని కాలనీ కి అంకితం చేస్తే విద్యా ర్థులకు చదువుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది గ్రామస్తులు కోరుతున్నారు. ప్రారంభం చేసి నెలలు గడుస్తున్న కాలనీ వాసులకు అప్పగించక పోవడంలో అంతర్యం ఏమిటని కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు.