calender_icon.png 5 June, 2025 | 6:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితులను ఉపేక్షించేది లేదు

15-05-2025 01:51:07 AM

హైడ్రా కమిషనర్ రంగనాథ్

తుర్కయంజాల్,మే 14 :తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడలో  హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. సర్వే నెంబర్ 951, 952లోని లే అవుట్ను  పరిశీలించారు. సమ్మిరెడ్డి బాల్ రెడ్డి అనే వ్యక్తి తమ ప్లాట్లను ఆక్రమించి, రహదారులపై అడ్డుగోడలు కట్టారని లే అవుట్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు.

బాల్ రెడ్డికి చెందిన ఫాంహౌస్ ప్రహరీ, ఫెన్సింగ్ గతంలోనే కూల్చివేశారు. అయితే బుధవారం రోజున హైడ్రా కమిషనర్ స్వయంగా రాజాజీ నగర్ లే అవుట్ కు వచ్చి అక్రమాలను పరిశీలించారు. రోడ్లు, పార్కు స్థలంలో మళ్లీ నిర్మించిన కట్టడాలను తొలగించారు.

మ్మిరెడ్డి బాల్ రెడ్డిపై హైడ్రా కమిషనర్ కు ప్లాట్ల ఓనర్లు ఫిర్యాదు చేశారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చెరువు ముంపు ప్రాంతాలను రంగనాథ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తుర్కయంజాల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి, హైడ్రా అధికారులు పాల్గొన్నారు.