10 April, 2026 | 4:45 PM

Breaking News

సంపూర్ణ ఆరోగ్యం యోగతోనే సాధ్యం - జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   చేనేత కార్మికుల ఆత్మగౌరవానికి అండగా నిలుస్తాం   •   శ్రీ భక్తంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు   •   రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం   •   రహదారి ప్రమాదాలు నివారణకు చర్యలు   •   పశువులలో గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం   •   అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహణ   •   ఉపాధి హామీ పనులతో చిన్నలింగపూర్ గ్రామానికి కొత్త ఊపిరి   •   మావోయిస్ట్ పార్టీకి మరో బిగ్ షాక్— లొంగిపోయిన 42 మంది కీలక మావోయిస్టులు   •   కాలభైరవ ఆలయంలో పూజలు   •  

ఓవైపు ఎన్నికల ప్రచారం.. మరోవైపు కొనసాగుతున్న భూ కబ్జా

06-02-2026 12:54 AM

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఓవైపు ఎన్నికలు ప్రచారం ఊపందుకోగా మరోవైపు పోటీ చేసిన అభ్యర్థులు వారి అనుచరులు భూకబ్జాలకు మళ్ళీ తెర లేపుతున్నారు. ప్రభుత్వ భూములు కుంటలను వాటి పక్కనే పట్టా భూములను కొనుగోలు చేసి ఉండగా ప్రభుత్వ భూములు సైతం మాదేనంటూ పాగా వేస్తున్నారు.

సరిగ్గా అధికారులు, నేతలు అంతా ప్రచారంలో మునిగి తేలుతుండగా భూ కబ్జా రాయుళ్ళు మాత్రం రాత్రికి రాత్రి భారీ హిటాచీలు జెసిబిల సహాయంతో ఎర్రమట్టి గుట్టలను తోలిచి ఆ మట్టిని ప్రభుత్వ భూముల్లో పోసి చదును చేస్తున్నారు.

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలోని సర్వే నంబర్ 7లో, భీమారం శివారులో ని చిన్నపాటి నీటి కుంటలను ఎర్రమట్టితో చదును చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.