08-06-2025 10:51:28 PM
నాగారం: నాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సూర్యాపేట జిల్లా డీఎస్పీ ప్రసన్నకుమార్(DSP Prasanna Kumar) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... నేరాల నియంత్రణకు పోలీసులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. ప్రజా వ్యతిరేక కార్యకలాపాల పాల్పడే వారిని ఉపేక్షించవద్దని సూచించారు. ప్రజలకు పోలీసు వ్యవస్థ పట్ల భరోసా కల్పిస్తూ స్నేహభావం నీ అలవర్చుకోవాలన్నారు. ఆయన వెంట నాగారం సర్కిల్ సిఐ రఘువీర్ రెడ్డి నాగారం ఎస్సై ఐలయ్య హెడ్ కానిస్టేబుల్ వలికి వెంకన్న కానిస్టేబుల్స్ లావణ్య సైదులు తదితరులు ఉన్నారు.