2 May, 2026 | 1:09 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

27న ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష

25-05-2025 12:00 AM

-ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలి

-టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపూల్ రాంరెడ్డి

ముషీరాబాద్, మే 24 (విజయ క్రాంతి) : తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 27న ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీయూ జేఏసీ) ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపూల్ రాంరెడ్డి తెలిపారు.

ఈ మేరకు శనివారం గాంధీనగర్ సబర్మతి నగర్ లో బస్తీ వాసులతో కలిసి గోడ పత్రికను జేఏసీ చైర్మెన్ సొంతం యాదగిరి, కోశాధికారి కలప చంద్రశేఖర్ ప్రసాద్ లతో కలసి ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, మేధావులు, కవులు, కళాకారులు సబ్బండవర్గాలు పెద్ద ఎత్తున హాజరై ఈ ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకాల వేదిక అధ్యక్షులు యాదగిరి, టీజేఎస్ నాయకులు మెరుగు శ్రీనివాస్ యాదవ్, మల్లేష్, సాయి బస్తీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.