14 July, 2026 | 11:46 AM

Breaking News

కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •  

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

09-07-2026 01:45 AM

కలెక్టర్ దివాకర టిఎస్

ఖమ్మం, జూలై 8 (విజయక్రాంతి): సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జ్వరం, జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు రెండు నుంచి మూడు రోజుల పాటు కొనసాగితే వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)ను సందర్శించి వైద్య పరీక్షలు చేయించు కోవాలని కలెక్టర్ తెలిపారు.

స్వీయ చికిత్సకు పాల్పడకుండా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా వ్యాధులు తీవ్రం కాకుండా నివారించవచ్చని అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండే పరిస్థితులను పూర్తిగా నివారించాలని, నిల్వ నీటిలోనే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా, చికన్గున్యా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, తలనొప్పి లేదా ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి లేదా సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి వైద్య సేవలు పొందాలని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా తమ కుటుంబాన్ని, సమాజాన్ని సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.