24 August, 2026 | 10:20 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు మద్దతు పలకాలి

21-03-2025 01:46 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చ్ 20 (విజయ క్రాంతి) : వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ప్రతి ఒక్కరు మద్దతు తెలిపాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ లోని కళాశాలలో గురువారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్.. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ రెండు రోజుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్  తో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... గతంలో పార్లమెంట్ లో చట్టాలు రూపొందిస్తే పాలకులకు తప్ప ప్రజలకు తెలిసేది కాదన్నారు.

యువత రాజకీయాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో పీఎం నరేంద్ర మోదీ కొత్త చట్టాల అమలు చేయడంలో వారిని భాగస్వాములు చేస్తున్నారన్నారు. ఒకే సారి అన్ని ఎన్నికలు నిర్వహిస్తే సమయంతో పాటు  వేల కోట్ల ప్రజల ధనం వృథా కాకుండా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్.వై.కే అధికారి సుశీల్ బర్డ్, కళాశాల ప్రిన్సిపల్ పున్నరావ్, వైస్ ప్రిన్సిపాల్ విజయ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు