11 April, 2026 | 1:18 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

విద్యుత్ షాక్ ఒకరికి తీవ్ర గాయాలు

14-11-2025 04:59 PM

మిడ్జిల్ : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ఒకరికి తీవ్ర గాయాలైన సంఘటన మిడ్జిల్ మండల కేంద్రంలో  చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎల్లికంటి పరుశురాములు తన వ్యవసాయ పొలంలో చేనుకు పైపులు మారుస్తుండగా 11 కెవి హై టెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో   విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది.

దీంతో గమనించిన పక్కన వ్యవసాయ పొలంలో ఉన్న రైతు శాంతయ్య తన దగ్గర ఉన్న టవల్ తో పక్కకు లాగాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో  హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక రైతులు విద్యుత్ అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపారు.