రూ.10 కోట్ల మోసం— సింగర్ మంగ్లీపై కేసు నమోదు
11-04-2026 12:13 PM
హైదరాబాద్: మైక్రోఫైనాన్స్ వ్యాపార పథకం పేరుతో ఒక న్యాయవాదిని రూ. 10 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు రావడంతో సింగర్ మంగ్లీపై(Singer Mangli) పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మైక్రోఫైనాన్స్ పథకానికి సంబంధించిన ఒక మోసంలో మంగ్లీ తనను రూ. 10 కోట్లు మోసం చేసిందని న్యాయవాది సుబ్బారావు ఆరోపించారు. ఆ న్యాయవాది మంగ్లీ, మరో ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి నుండి తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపాడు. పంజాగుట్ట పోలీసులు మంగ్లీ, మరో ముగ్గురిపై బీఎన్ఎస్ లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




