ఓఎన్జీసీ నికరలాభం 78 శాతం వృద్ధి
ఆదాయం రూ.1.66 లక్షల కోట్లు
షేరుకు రూ.5 చొప్పున డివిడెండు
న్యూఢిల్లీ, మే 21: ప్రభుత్వ రంగ చమురు ఉత్పాదక కంపెనీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) నికరలాభం 2024 మార్చితో ముగిసిన క్యూ4లో భారీగా 78 శాతం వృద్ధిచెంది రూ. 11,526 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 6,478 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం రూ.1.64 లక్షల కోట్ల నుంచి రూ.1.66 లక్షల కోట్లకు పెరిగింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఓఎన్జీసీ రూ.57,101 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభా న్ని ఆర్జించింది. ముగిసిన ఏడాది క్రూడాయి ల్ ఉత్పత్తి 2.4 శాతం పెరిగిందని, సహజవా యువు ఉత్పత్తి 3 శాతం తగ్గిందని కంపెనీ వెల్లడించింది. ఓఎన్జీసీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ. 5 చొప్పున డివిడెండును సిఫార్సుచేసిం ది. కంపెనీ ఏజీఎంలో షేర్హోల్డర్ల అనుమ తికి లోబడి డివిడెండును చెల్లిస్తుంది.






