calender_icon.png 15 June, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు

11-06-2025 12:05:11 AM

మఠంపల్లి, జూన్ 10: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులో మండలంలో కొనసాగుతున్నాయి. పోలవరం మండలంలోని రఘునాధపాలెం గ్రామంలో  భూభారతి రెవెన్యూ సదస్సులో  తాహశీల్దార్ లావురి మంగా పాల్గొనీ మాట్లాడారు. రైతులకు భూమికి సంబంధించి ఎలాంటి సమస్యా ఉన్న అధికారుల దృష్టికి తీసుకొస్తే వాటిని సర్వే చేసి ఆ సమస్య పరిష్కరించడానికి వీలుంటుందని అన్నారు.

అనంతరం రైతులకు భూభారతి చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ బాలరాజు,ఆర్ ఐ జానీ పాషా, ఏఎస్‌ఓ క్రాంతి, కార్యదర్శి లక్ష్మణ్, రికార్డ్ అసిస్టెంట్ సతీష్, చెన్నయ్య, విఆర్‌ఎ లు జానీ,ఆలీ,సిబ్బంది  రైతులు తదితరులు పాల్గొన్నారు.