calender_icon.png 30 June, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకొందాం

30-06-2025 02:32:26 AM

కామారెడ్డి, జూన్ 29 , (విజయక్రాంతి ): జూలై 13న జరిగే మహంకాళి బోనాల పండుగలను ప్రశాంతంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరుపుకుందాం అని ఆలయ కమిటీ అధ్యక్షుడు సిద్ధారెడ్డి. కార్యదర్శి ప్రబులు కోరారు. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం  కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, మాజీ అధ్యక్షులు, స్థానిక ప్రజలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగా బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకుంటామన్నారు. దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ మరియు వ్యాపార సంబంధించిన పరిమిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని. కేవలం పండుగ రోజుల్లో తప్ప మరి ఎప్పుడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని గ్రామ ప్రజలు పెద్దలు తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు ఎల్లం వెంకటేశం రమేష్ బాలరాజ్ తో పాటు పూజారి చంద్ర, నాయకులు తిరుమల్ గౌడ్, అనంతరెడ్డి, నల్ల శ్రీనివాస్, ఐరేని నరసయ్య, సీతారాం మధు, శ్రీకాంత్, గోపాల్ రెడ్డి, నర్సారెడ్డి శంకర్ రెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి నరేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, పాలకుర్తి శేఖర్, రాజిరెడ్డి, నర్సింలు, సాయి రెడ్డి, కానుగంటి నాగరాజ్, పిన్నెం రామచంద్రం, పూనా లక్ష్మణ్,పూజారి శరత్ చంద్ర,పోచయ్య,తో పాటు పలువురు పాల్గొన్నారు.