22-05-2025 01:28:52 AM
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సూర్యం
హైదరాబాద్, మే 21: ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ఎన్కౌంటర్ను ఖండిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పీ సూర్యం బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులను శాంతి చర్చలకు పిలవాలని, ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు కోరుతున్న కేం ద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.
ప్రభుత్వం చేస్తున్న ఈ హత్య లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిలచే న్యాయవిచారణ జరిపించాలని కోరా రు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన కేశవరావు తదితర మావో యిస్టులకు విప్లవ జోహర్లు ప్రకటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.