22-05-2025 01:31:20 AM
హైదరాబాద్, మే 21: ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ ప్రాంతం లో బుధవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 27మంది మావోయిస్టులు మృతి చెందడం నిషేధిత మావోయిస్టు సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు విలవిలలాడు తున్నారు. ఈ ఎన్కౌంటర్తో ఈ ఏడాది మరణించిన మావోయిస్టుల సంఖ్య 200కు చేరుకుంది.
ఇందులో బస్తర్ ప్రాంతంలోనే 183 మంది ఉన్నారు. ఇటీవల ఛత్తీస్గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట పర్వతాల్లో 24 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో భద్రతా బలగాలు 31 మంది మావోయిస్టులను హతమార్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం బస్తర్లో 217 మందితో సహ 219 మంది మావోయిస్టులు మృతిచెందారు.